Tuesday, May 7, 2024

TS | డ్రోన్ ప్రదర్శనతో వినోదం.. విద్యార్థులకు విజ్ఞానం : మంత్రి శ్రీనివాస్ గౌడ్

మహబూబ్‌న‌గర్, (ప్రభ న్యూస్): మహబూబ్ నగర్ పట్టణంలోని ట్యాంక్ బండ్ పై అతిపెద్ద డ్రోన్ ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఈనెల 13న సాయంత్రం 7 గంటలకు జిల్లాస్థాయిలో మొట్టమొదటిసారిగా అతిపెద్ద డ్రోన్ ప్రదర్శన నిర్వహిస్తున్నామని, ఈ డ్రోన్ ప్రదర్శన వల్ల పట్టణ ప్రజలకు వినోదంతో పాటు, విద్యార్థులకు విజ్ఞానాన్ని అందిస్తుందని తెలిపారు. ఒకప్పుడు మహబూబ్నగర్ జిల్లా కరువు, కాటకాలకు, వలసలకు పేరుగాంచిందని, అలాంటిది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత జిల్లాలో వివిధ రకాల కార్యక్రమాలను, ఉత్సవాలను ,సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు.

ఇందులో భాగంగానే ఈనెల 13వ తేదీ మహబూబ్ నగర్ ట్యాంక్ బండ్ పై పెద్ద ఎత్తున డోన్ ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని స్టేడియం గ్రౌండ్లో నిర్వహించిన ఈషా గ్రామోత్సవ్ క్రీడలలో మంత్రి మాట్లాడుతూ డ్రోన్ ప్రదర్శనకు పట్టణ ప్రజలతో పాటు, ఇతర ప్రాంతాల ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement