Friday, April 26, 2024

రేపు మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లాలో సీఎం కేసీఆర్ ప‌ర్య‌ట‌న..

సీఎం కేసీఆర్ రేపు మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లాలో ప‌ర్య‌టించ‌నున్నారు. నూతన సమీకృత కలెక్టరేట్ కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. కొత్త కలెక్టరేట్ ప్రారంభోత్సవంతో పాటు పాత కలెక్టరేట్ స్థానంలో నిర్మించనున్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేస్తారు. ఒక్క ఏడాదిలో పనులు పూర్తి చేసి, ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. బస్టాండ్ సమీపంలో నిర్మించిన పార్టీ కార్యాలయాన్ని కూడా ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. మినీ ట్యాంక్ బండ్ వద్ద వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. అనంతరం భారీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్ర‌సంగించ‌నున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement