Sunday, April 28, 2024

TS: ఛ‌త్ర‌ప‌తి శివాజీ విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించిన ఎమ్మెల్యే

గద్వాలప్రతినిధి, ఫిబ్రవరి 19 (ప్రభ న్యూస్) : గద్వాల నియోజకవర్గం ధరూర్ మండల పరిధిలోని ఆరెకటిక సంఘం ఆధ్వర్యంలో ఉప్పేర్ గ్రామంలో శ్రీ ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా నూతన ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి పూల దండలు వేసి కొబ్బరికాయ కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గద్వాల నియోజకవర్గ ప్రజలందరికీ శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ 397వ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. గద్వాల నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా ఉప్పేర్ గ్రామంలో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ప్రతిష్ఠించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ మాజీ ఛైర్మన్ జంబు రామన్ గౌడ, ఎంపీపీ విజయ్ కుమార్, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కృష్ణారెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి, ప్రభాకర్ గౌడ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement