Sunday, May 12, 2024

అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు..


మహబూబ్‌నగర్‌ : ప్రభుత్వ ఉద్యోగుల వయోపరిమితిని 61 కి పెంపును వెనక్కి తీసుకోవాలని నిరుద్యోగ జెఎసి , ఓయు జెఎసి ఛలో అసెంబ్లి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో తెలంగాణ నవనిర్మాణ్‌ విద్యార్థి సేన రాష్ట్ర కార్యదర్శి కొండకళ్ల విష్ణువర్దన్‌ , జిల్లా ఉపాధ్యక్షుడు మంద శరత్‌ కుమార్‌ ని అక్రమంగా పోలీసులు అరెస్టు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణలో ప్రాణాలు అర్పించింది విద్యార్థి , నిరుద్యోగులే అని గుర్తుపెట్టుకోవాలి. అదే ఆనాడు తెలంగాణ కోసం విద్యార్‌థులు , నిరుద్యోగులు ఏకం అయ్యి తెలంగాణ తెస్తే ఈనాడు అదే తెలంగాణ విద్యార్‌థులకు అన్యాయం చేస్తుండు అని మండిపడ్డారు. త్వరలో విద్యార్థి నిరుద్యోగులం అంతా ఒకటి అవుతాం , నిన్నూ , నీ ప్రభుత్వాన్ని కూల్చివేస్తామని హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement