Monday, April 29, 2024

సిసి రోడ్డునిర్మణానికి భూమి పూజ..


మహబూబ్‌నగర్ : మండల పరిధిలోని పరిధిలోని జానంపేట గ్రామంలో సిసి రోడ్డు నిర్మాణానికి , అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజి నిర్మాణానికి ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌ రెడ్డి భూమి పూజ చేశారు. గ్రామాలను అభివృద్ది చేయాలనే తపనతోనే సిసి రోడ్లు , అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజి , కాల్వల నిర్మాణం చేపట్టడం ఆయన తెలిపారు. గ్రామాల అభివృద్ది కోసం తెలంగాణ ప్రభుత్వం ఎంతో అహర్నిశలు కృషి చేస్తుందని ఆయన అన్నారు. జానంపేట గ్రామాన్ని మరింత అభివృద్ది పథంలోకి తీసుకువెళ్లేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. రాజకీయాలకు అతీతంగా గ్రామాలను అభివృద్ది చేసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆయన అన్నారు. అనంతరం గ్రామంలో నిర్మాణం చేపడుతున్న డబల్‌ బెడ్‌ రూంలను పరిశీలించి , మరింత వేగంగా పూర్తి చేసందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధికారులు , పార్టీ సర్పంచ్‌లు , ఎంపిపిలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement