Wednesday, May 1, 2024

ఏ ప‌ల్లెల్లోనైనా తెలంగాణ వంటి అభివృద్ధిని చూపిస్తారా : కేటీఆర్

ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తున్న ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వమేనని, బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని ఏ పల్లెల్లోనైనా.. ఎక్కడైనా.. తెలంగాణ వంటి అభివృద్ధిని చూపిస్తారా..తెలంగాణ రాష్ట్ర పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ ప్ర‌శ్నించారు. శుక్రవారం మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం కోడ్గల్ లో మంత్రి కేటీఆర్ పర్యటించారు. ఈసందర్భంగా 40 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన రైతు వేదికలో ఆయన మాట్లాడుతూ… స్వతంత్రం వచ్చిన తర్వాత దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఇంత త్వరగా అభివృద్ధి పనులు జరగలేదన్నారు.

అరవై ఏండ్ల కాలంలో ఎంతో మంది సీఎంలు వచ్చి తెలంగాణ కోసం చేసిందేమి లేదని, ప్రస్తుతం సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం.. అభివృద్ధి, సంక్షేమం దిశగా దూసుకుపోతోందన్నారు. వృద్ధుల కు పింఛ‌న్లు, ఆడపిల్లల పెళ్లికి లక్ష రూపాయలు ఇచ్చి తల్లిదండ్రుల ఆత్మగౌరవాన్ని కాపాడారని మంత్రి కేటీఆర్ అన్నారు. కేసీఆర్ కిట్ల వల్లే ప్రభుత్వ ఆస్పత్రిలో కాన్పులు పెరిగాయన్నారు. మొన్న బడ్జెట్ తర్వాత సీఎం కేసీఆర్ ఆవేదనతో.. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వమని అడిగితే కేంద్ర ప్రభుత్వం నుంచి ఉలుకు పలుకూ లేదన్నారు. కేంద్రం కలసి వచ్చినా రాకపోయినా.. మీ ఆశీర్వాదంతో సీఎం కేసీఆర్ ప్రభుత్వం వెనకడుగు వేయలేదు.. వేయదని కేటీఆర్ అన్నారు.ఈకార్యక్రమంలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి.. మంత్రులు శ్రీనివాస్ గౌడ్.. నిరంజన్ రెడ్డిలు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement