Friday, April 26, 2024

అవయవ దానం చేసిన యువకుడికి సెల్యూట్..

మహబూబ్‌నగర్‌ :‌ నియోజకవర్గ పరిధిలోని రాంచంద్రాపూర్‌ గ్రామానికి చెందిన రాములు (24) అనే యువకుడు గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ… హైద్రాబాద్‌ మలక్‌పేట్‌లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే చికిత్స పొందుతున్న రాములుకు హఠాత్తుగా బ్రెయిన్‌ డెడ్‌ అయిందని వైద్యులు నిర్దారించారు. దీంతో అతని కుటుంబ సభ్యులు తండ్రి కృష్ణయ్య , భార్య రాధిక రాములు అవయవదానానికి ముందుకు వచ్చారు. రాములు నుంచి సేకరించిన అవయవాలను వైద్యులు మరో ఎనిమిది మందికి అమర్చి ప్రాణాలు కాపాడారు. చనిపోయి కూడా మరో 8 మంది ప్రాణాలను కాపాడటం తమకు ఆనందాన్ని కలిగిస్తుందని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ యశోద ఆసుపత్రికి చేరుకొని రాములు కుటుంబ సభ్యులను పరామర్శించి అతని భౌతిక ఖాయానికి నివాళులుఅర్పించారు. అనంతరం రాములు అవయవ దానానికి ముందుకు వచ్చిన కుటుంబ సభ్యులను అభినందించి వారి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement