Thursday, May 9, 2024

చింతకుంట లో కుక్కల దాడిలో 14 గొర్రెలు మృతి

కోసిగి : మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లాలో గొర్రెల మంద‌పై కుక్క‌ల దాడి చేయ‌డంతో 14 గొర్రెలు మృతిచెందాయి. కోసిగి మండల పరిధిలోని చింతకుంట గ్రామానికి చెందిన నరసప్ప గారి హనుమంతు అనే గొర్రెల కాపరికి చెందిన గొర్రెలు కుక్కల దాడిలో మృతి చెందడంతో గ్రామంలోని గొర్రెల కాపరులు ఆందోళన చెందుతున్నారు. పొలంలో గొర్రెలు నిలుపుటకు ఏర్పాటు చేసిన స్థలంలో గొర్రెలు ఉండగా ఆ మందలోకి ఆరు కుక్కలు ప్రవేశించి దాడి చేయడంతో 14 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. బాధిత కాపరికి సుమారు రూ 1 లక్ష 50 వేలు ఆస్తి నష్టం జరిగింది. మృతిచెందిన గొర్రెలు ఒక్కొక్కటి తొమ్మిది వేల నుండి 11 వేల వరకు ఖరీదు ఉంటుందని బాధితులు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement