Wednesday, May 1, 2024

Mahabubnagar – 23 లక్షల 73 వేల నగదును పట్టుకున్న వన్ టౌన్ పోలీసులు…

మహబూబ్ నగర్,క్రైమ్ అక్టోబర్ 16 (ప్రభ న్యూస్): మహబూబ్నగర్ పట్టణంలోని క్లాక్ టవర్ చౌరస్తాలో సోమవారం వన్టౌన్ సిఐ సైదులు ఆధ్వర్యంలో సిబ్బంది వాహనాల తనిఖీ చేపట్టారు.ఈ తనిఖీలో రూ.28.73 వేల న‌గ‌దును స్వాధీనం చేసుకున్నారు. వివ‌రాల‌లోకి వెళితే ఉదయ్ కుమార్, రవికుమార్ అనే ఇద్దరు వ్యక్తులు ఏలాంటి ధ్రువ పత్రాలు లేకుండా ద్విచక్ర వాహనంపై 28 లక్షల 73 వేల రూపాయలు నగదును తరలిస్తుండగా అనుమానం వచ్చిన పోలీసులు త‌నిఖీ చేశారు. రెండు సంచుల‌లో న‌గ‌దు క‌నిపించ‌డంతో వాటికి సంబంధించిన వివ‌రాల‌ను అడిగారు.. స‌రైన అధారాలు చూప‌క‌పోవ‌డంతో మొత్త 28.73 ల‌క్ష‌ల‌ను సీజ్ చేశారు . అనంతరం సిఐ సైదులు మాట్లాడుతూ ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నందున ప్రజలు ఎవరు కూడా 50 వేలకు మించి నగదు తరలించరాదని ఒకవేళ అంతకు మించిన డబ్బును తరలించినట్లు అయితే వాటికి సంబంధించిన సరైన ధ్రువపత్రాలు ఉండాలని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement