Sunday, April 28, 2024

Mahabubabad – దేవుళ్ల‌నే ఎత్తుకెళ్లారు….

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం గుండెపుడి గ్రామంలో మంగళవారం రాత్రి చోరీ జ‌రిగింది. సీతారాములవారి దేవస్థానంలో కొలువైన గరుడ వాహనం, ఆంజనేయస్వామి విగ్రహం, శేష వాహనం (గుర్రం) ను దొంగ‌లు ఎత్తుకెళ్లారు. శేష‌ వాహనం యొక్క గొడుగు, బంగారు పూతతో చేసినటువంటి నాణేల‌ను కూడా దొంగ‌లు అప‌హ‌రించారు. బుధ‌వారం ఉద‌యం ఆల‌యం వ‌ద్ద‌కు చేరుకున్న పూజారులు, భ‌క్తులు చోరీ జ‌రిగిన విష‌యాన్ని గుర్తించారు. దీంతో పోలీసుల‌కు స‌మాచారం అందించారు. ఆల‌యం వ‌ద్ద‌కు చేరుకున్న పోలీసులు.. చోరీ జ‌రిగిన ప్ర‌దేశాన్ని ప‌రిశీలించారు. ఆల‌య ప‌రిస‌రాల‌ను పోలీసులు క్షుణ్ణంగా త‌నిఖీ చేశారు. కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement