Sunday, May 5, 2024

న‌ర్సాపూర్ టికెట్ మ‌ద‌న్ రెడ్డికే ఇవ్వాలంటూ హ‌రీష్ రావు ఇంటి ముందు ధ‌ర్నా

హైద‌రాబాద్ – ఉమ్మడి మెదక్ జిల్లాలోని నర్సాపూర్ అసెంబ్లీ స్థానం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే మదన్ రెడ్డికి బీఆర్ఎస్ టికెట్ కేటాయించాలని కోరులూ హైదరాబాద్‌లోని మంత్రి హరీశ్‌రావు ఇంటి ముందు నర్సాపూర్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు ఆందోళనకు దిగారు. కాగా, మదన్ రెడ్డికి బీఆర్ ఎస్ టికెట్ కేటాయించాలని కోరుతున్నారు. ఈ స్థానం నుంచి పోటీ చేసే అభ్యర్థిని పార్టీ ప్రకటించలేదు. బీఆర్‌ఎస్‌ ప్రకటించని నాలుగు స్థానాల్లో నర్సాపూర్‌ ఒకటి. బీఆర్‌ఎస్‌ టికెట్‌ రాకపోతే రాజీనామా చేస్తానని మదన్‌రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. నర్సాపూర్ అసెంబ్లీ స్థానం నుంచి మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డిని బరిలోకి దింపాలని బీఆర్‌ఎస్ నాయకత్వం యోచిస్తున్నట్లు సమాచారం.

అయితే నియోజకవర్గంలోని బీఆర్ ఎస్ ప్రజాప్రతినిధులు మదన్ రెడ్డికి మద్దతుగా నిలుస్తున్నారు. ఈ నెల 21న మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కలిశారు. అయితే ఈ స్థానం నుంచి పోటీ చేసే అభ్యర్థిని కేసీఆర్ ప్రకటించలేదు. ఈ జాబితాను త్వరలో ప్రకటించనున్నారు. కేసీఆర్. అయితే నర్సాపూర్‌ టికెట్‌ మదన్‌రెడ్డికి కేటాయించాలని ఆ నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు హరీశ్‌రావుకు డిమాండ్‌ చేశారు. మదన్ రెడ్డికే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. మంత్రి హరీశ్ రావును కలిసేందుకు మదన్ రెడ్డి ప్రయత్నాలు ప్రారంభించారు

Advertisement

తాజా వార్తలు

Advertisement