Thursday, May 2, 2024

Karimnagar | రాబోయే ఎన్నికల్లో బిఆర్ఎస్ సత్తా చాటుదాం : బోయినపల్లి వినోద్ కుమార్

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సారధి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జనరంజకంగా పాలన సాగించినప్పటికీ… ప్రజా క్షేత్రంలోకి వెళ్లి స్థానిక సంస్థల మరియు పార్లమెంటు ఎన్నికల్లో… బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటుతూ ముందుకు సాగుదామని మాజీ ఎంపీ, రాష్ట్ర ప్రణాళిక సంఘం మాజీ ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. చొప్పదండి నియోజకవర్గం పరిధిలోని రామడుగు మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఆధ్వర్యంలో శుక్రవారం బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి హాజరైన వినోద్ కుమార్ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి గల కారణాలను కార్యకర్తలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు కార్యకర్తలు మాట్లాడుతూ… మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అంటే రాష్ట్ర ప్రజానీకానికి తెలంగాణ జాతిపితగా అపారమైన గౌరవం ఉందని అన్నారు. పాలనలో జరిగిన చిన్న చిన్న లోపాలతోనే పార్టీ ఓటమిని చవిచూడాల్సిన పరిస్థితి వచ్చిందని ప్రజలకు సేవ చేయాలని ఎన్నికల్లో గెలిచిన వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ విజయం సాధించేలా నాయకులు, కార్యకర్తలు సమాయత్తం కావాలని వినోద్ కుమార్ అన్నారు.

ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్న సమయంలో దేశంలోనే రాష్ట్రానికి ఒక ప్రత్యేక గుర్తింపు వచ్చిందని ఆదాయ వనరులను మెరుగుపరచుకోవడంలో దేశంలోనే రాష్ట్రం రెండో స్థానంలో ఉందని గుర్తు చేశారు. ప్రజలకు మెరుగైన పాలన అందించేందుకు కేసీఆర్ ఎంతో కృషి చేశారని అన్నారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఎవరు అధైర్యపడవద్దని ప్రజాక్షేత్రంలో ప్రజల పక్షాన ప్రజలకు మెరుగైన పాలన అందించేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో , టిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement