Friday, May 3, 2024

వెంకన్న ఆలయంలో భారీ చోరీ, బంగారం, వెండి ఆభరణాలు మాయం

కేసముద్రం, (ప్రభాన్యూస్ ): మహబుబాబాద్​ జిల్లా కేస‌ముద్రం మండలంలో భారీ చోరీ జరిగింది. అమీనాపురంలోని భూనీలా సమేత వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 25 కిలోలు, దాదాపు రూ. 20 లక్షల విలువైన వెండి, బంగారు ఆభరణాలు దుండగులు దోచుకెళ్లారు. దీనిపై రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు వేగం చేశారు. డీఎస్పీ ఆధ్వర్యంలో క్లూస్ టీం ఆధారాలు సేకరించింది. దొంగలను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement