Monday, April 29, 2024

TS : నాచగిరిలో లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు…భారీ బందోబస్తు…

గజ్వేల్, ఏప్రిల్8 ( ప్రభ న్యూస్) సిద్దిపేట జిల్లా వర్గల్ మండలంలోని నాచగిరి లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ప్రధాన ఆలయంలోని లక్ష్మీ దేవి అమ్మవారి నరసింహ స్వామి వారి ఉత్సవ మూర్తులను నయనానందకరంగా అలంకరించారు.

- Advertisement -

బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ రథోత్సవం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆలయం వద్ద పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. రథోత్సవం సందర్భంగా గజ్వేల్ రూరల్ సిఐ మహేందర్ రెడ్డి, గౌరారం ఎస్ఐ శివకుమార్, ములుగు ఎస్ఐ విజయ్ కుమార్, పోలీస్ సిబ్బందితో కలిసి పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement