Thursday, April 25, 2024

కార్పొరేష‌న్ కు అవార్డు రావ‌డంలో అధికారులు, కార్మికుల శ్ర‌మ : మేయ‌ర్

స్వచ్ఛ సర్వేక్షన్ సఫాయి మిత్ర సురక్ష ఛాలెంజ్ లో భాగంగా దేశంలోని 4300 ప్రాంతాల్లో జరిగిన స్వచ్ఛత, ఆయా పట్టణాల్లో పారిశుధ్యానికి ఆయా నగర, పుర పాలికలు చేస్తున్న సేవలకు మెచ్చి అత్యుత్తమ సేవ, అభివృద్ధి రంగాల్లో ముందున్న కార్పొరేషన్స్, పురపాలికలు అత్యుత్తమ నగరాలలో భాగంగా దేశ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా అత్యున్నత పురస్కారం అందుకున్నారు.

పుర‌స్కారం కు నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికవటం, కార్పొరేషన్ పాలక వర్గానికి, ప్రజలకు గర్వకారణం.. ఈ ప్రయాణంలో కార్పొరేషన్ అభివృద్ధికి అనునిత్యం తోడునిలిచి నేడు ఈ స్థానంలో నిలిపిన ఉమ్మడి రంగారెడ్డి జిల్లా MLC శంభీపూర్ రాజుకు, MLA కేపి వివేకానంద గౌడ్ కు, మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యుల తరుపున హృదయపూర్వక ధన్యావాద అభివందనాలు తెలిపారు. అనంతరం మేయర్ మాట్లాడుతూ… ఈ ఘ‌న‌తలో కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది, కార్మికుల శ్రమ ఎంతగానో ఉన్నదని, వారికి హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నట్లు మేయ‌ర్ తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement