Monday, April 29, 2024

మంత్రులతో రమణ సమావేశం

టీఆర్ఎస్ పార్టీలో చేరిన తెలంగాణ టీడీపీ మాజీ అధ్యక్షుడు ఎల్.రమణ మినిస్టర్స్ క్వార్టర్స్ లో మంత్రులు కొప్పుల ఈశ్వర్, ఎర్రబెల్లి దయాకరరావులతో సమావేశమయ్యారు. సుమారు గంట పాటు జరిగిన ఈ సమావేశంలో పార్టీ వ్యవహారాలు, ప్రభుత్వ పధకాలపై వారు చర్చించారు. అలాగే రాబోయే హుజూరాబాద్ ఉప ఎన్నికలపై కూడా వారు చర్చించినట్టు సమాచారం. ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యేలు విద్యాసాగర్ రావు, డాక్టర్ సంజయ్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.

కాగా, టీడీపీకి ఇటీవల రాజీనామా చేసిన రమణ.. సోమవారం ఉదయం టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేతుల మీదుగా పార్టీ సభ్యత్వం తీసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement