Saturday, May 18, 2024

నేడు మంత్రి కేటీఆర్‌ సిరిసిల్ల, ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్‌ పర్యటన

రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ మంగళవారం సిరిసిల్ల, ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్‌ మండలాల్లో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు ముస్తాబాద్‌ మండలం మోహినికుంటలో తమ బంధువులైన కల్వకుంట్ల చక్రధర్‌రావు కుటుంబా న్ని పరామర్శిస్తారు. 11:30 గంటలకు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ మైదానంలో గిఫ్ట్‌ ఏ స్మైల్‌ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ జూనియర్‌ కళాశాల విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ చేస్తారు. మధ్యాహ్నం 12:30 గంటలకు అక్కడే వృద్ధుల డే కేర్‌ సెంటర్‌కు ప్రారంభోత్సవం చేయనున్నారు. మధ్యా హ్నం ఒంటి గంటకు రాచర్ల గొల్లపల్లిలో ఎల్లమ్మ సిద్దోహానికి హాజరవుతారు. అనంతరం రాచర్ల గొల్లపల్లిలో రైతు వేదిక, మధ్యాహ్నం 2 గంటలకు రాచర్ల బొప్పాపూర్‌, మూడు గంటలకు వెంకటాపూర్‌లో నూతన గ్రామపంచాయతీ భవనాలకు ప్రారంభోత్సవం చేస్తారు. అనంతరం సాయం త్రం 4 గంటలకు మండేపల్లిలో కేసీఆర్‌ నగర్‌లో ఇండ్ల పట్టాల పంపిణీ చేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement