Saturday, May 4, 2024

KTR – ప్రజల దయ ఉంటే మళ్లీ గెలుస్తా: మ‌రింత మెరుగైన సేవ చేస్తా ..

ఎల్లారెడ్డిపేట: ప్ర‌జ‌ల ద‌య ఉంటే ఎమ్మెల్యేగా మళ్లీ గెలుస్తాన‌ని, అనంత‌రం మ‌రింత మెరుగైన సేవ చేస్తాన‌ని ఐటి శాఖ మంత్రి,బిఆర్ఎస్ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు కెటిఆర్ ఆన్నారు..రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేటలో పాఠశాల సముదాయ భవనాలను కేటీఆర్‌ ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ‘‘అమెరికాలో ఎక్కడికి వెళ్లినా మన తెలుగు వారు కలుస్తుంటారు. తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో చదివి అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారు. విద్యతోనే వికాసం, విద్యతోనే ఆత్మవిశ్వాసం. ఎల్లారెడ్డిపేటకు డిగ్రీ కళాశాల కచ్చితంగా వస్తుంది. 9 ఏళ్ల క్రితం పరిస్థితులు.. ప్రస్తుత పరిస్థితులపై ప్రజలు ఆలోచించాలి. ’’ అని కేటీఆర్ కోరారు.. అలాగే విద్యార్థులకు ఉపాధ్యాయులు నాణ్యమైన విద్యను అందించాలని ఆయ‌న సూచించారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement