Sunday, May 5, 2024

Karimnagar : ట్రాక్టర్ పై నుండి పడి.. బాలుడి మృతి

ట్రాక్టర్ పై వెళ్తుండగా అదుపుతప్పి బోల్తా పడడంతో బాలుడు కింద పడి మృతి చెందాడు.ఈ సంఘ‌ట‌న‌ కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం ఊటూరు గ్రామంలో చోటు చేసుకుంది. కాగా గ్రామానికి చెందిన పుట్ట రామ్ చరణ్ తన తండ్రి పుట్ట తిరుపతితో ట్రాక్ట‌ర్ పై వెళ్తుండ‌గా ఈ ప్ర‌మాదం జ‌రిగింది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement