Sunday, May 5, 2024

‘పంచాయత్‌’ స్వశక్తికరణ్‌ అవార్డు గ్రహీలకు కేటీఆర్‌ అభినందనలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : దీన్‌ దయాల్‌ ఉపాధ్యాయ పంచాయత్‌ స్వక్తికరణ్‌ పురస్కారాన్ని సిరిసిల్ల జిల్లా ప్రజా పరిషత్‌ చైర్మన్‌ శ్రీమతి న్యాలకొండ అరుణ, వైస్‌ చైర్మన్‌ సిద్ధం వేణు, డీపీవో రవీందర్‌లను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ను అభినందించారు. ఆదివారం జాతీయ పంచాయతీరాజ్‌ దినోత్సవం సందర్భంగా రంగారెడ్డి జిల్లా పరిషత్‌ భవనంలో నిర్వహించిన కార్యక్రమంలో వీరికి పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అందజేశారు. అలాగే ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డులు మద్దికుంట(ముస్తాబాద్‌ మండలం), మండేపల్లి(తంగల్లపల్లి మండలం) అవార్డులను అందించారు. వీరంతా అవార్డు స్వీకరించిన అనంతరం మంత్రి కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement