Saturday, May 4, 2024

Jion BRS – సిపిఐకు బిగ్ షాక్ – కెటిఆర్ స‌మ‌క్షంలో కారెక్కిన కౌన్సిల‌ర్లు

భద్రాద్రి కొత్తగూడెం : కొత్తగూడెంలో సీపీఐపార్టీ కి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీకి రాజీనామా చేసి పలువురు సీపీఐ కౌన్సిలర్లు ఐటీ, మున్సిపల్‌, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. వారికి మంత్రి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బీఆర్ఎస్ పార్టీలో చేరిన వారిలో సీపీఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి, మున్సిపల్‌ ఫ్లోర్ లీడర్ వై. శ్రీనివాసరెడ్డి , ఒకటో వార్డు కౌన్సిలర్, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు బోయిన విజయ్ కుమార్, 18 వ వార్డు కౌన్సిలర్ పి.సత్యనారాయణ చారి, 16 వ వార్డు కౌన్సిలర్ మాచర్ల రాజకుమారి, 30 వ వార్డు కౌన్సిలర్ నేరేళ్ల సమైక్య, సీపీఐ పట్టణ సహాయ కార్యదర్శి, మాజీ కౌన్సిలర్ మాచర్ల శ్రీనివాస్, ఏఐటీయూసీ పట్టణ కన్వీనర్ పిడుగు శ్రీనివాస్, తదితరులు ఉన్నారు.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ బిఆర్ఎస్ సిద్ధాంతాలు, కెసిఆర్ ఆశయాలు నచ్చి పార్టీలోకి వచ్చే వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటామని హామీ ఇచ్చారు. వనమా గెలుపే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు.

అనంత‌రం కౌన్సిలర్లు మాట్లాడుతూ తెలంగాణ రథసారధిగా తెలంగాణ జాతిపితగా కెసిఆర్ నాయకత్వంలో బిఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం యావత్ తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం చేస్తున్న కార్యక్రమాలు నచ్చి బిఆర్ఎస్ లో చేరుతున్నట్లుగా వారు ప్రకటించారు. ✍️ అదేవిధంగా కొత్తగూడెం నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యులు వనమా వెంకటేశ్వరరావు రాజకీయాలకు అతీతంగా నిరంతరం చేస్తున్న అభివృద్ధి పనులు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు నచ్చే వారి నాయకత్వంలో పనిచేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగిందని, వారి గెలుపు కోసం శక్తి వంచన లేకుండా శ్రమిస్తామని వారి సారధ్యంలో కొత్తగూడెంలో మా వార్డుల అభివృద్ధికి ప్రజా సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తామని వారు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement