Sunday, April 28, 2024

TS: కొండా ల‌క్ష్మ‌ణ్ బాపూజీ ఆద‌ర్శ‌ప్రాయుడు.. పౌర సంబంధాల శాఖ డైరెక్టర్​

తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ నిరంతరం తపించి, తొలి తరం ఉద్యమ కారుడిగా అందరికీ ప్రేరణగా నిలిచారని సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ బి. రాజమౌళి అన్నారు. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 108వ జయంతి సందర్భంగా బుధవారం మాసబ్ టాంక్ లోని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనేక ఆటుపోట్లను ధైర్యంగా ఎదుర్కొని తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా ఆచార్య ఆత్రేయ కొండా లక్ష్మణ్ బాపూజీ పోరాడారని కొనియాడార‌న్నారు.

ఈ కార్యక్రమంలో సమాచార పౌర సంబంధాల శాఖ అదనపు సంచాలకులు నాగయ్య కాంబ్లే, మీడియా అకాడమీ సెక్రెటరీ వెంకటేశ్వరరావు, సంయుక్త సంచాలకులు శ్రీనివాస్, ఆర్ఐ ఈ రాములు, జయ రామ్మూర్తి, ఉప సంచాలకులు మధుసూదన్, వెంకటేశ్వర్లు, రాజారెడ్డి, హష్మీ , ప్రసాదరావు, ఇతర అధికారులు, ఉద్యోగులు హాజరై ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి నివాళులర్పించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement