Thursday, May 2, 2024

ఒకే రోజు అయిదుగురికి మోకాలిచిప్ప మార్పిడి ఆపరేషన్లు.. ఉస్మానియా డాక్టర్ల సక్సెస్​

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: దీర్ఘకాలంగా ఎముకల అరుగుదల సమస్యలతో బాధ పడుతున్న అయిదుగురు రోగులకు మోకాలి చిప్పల మార్పిడి, మరో రోగికి తుంటి మార్పిడి శస్త్ర చికిత్సను ఉస్మానియా వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. జనగామ జిల్లాకు చెందని ఆరుగురు రోగులు ఎముకుల వ్యాధితో ఆసుపత్రిలో చేరగా వారికి మోకాలిచిప్ప మార్పిడి ఆపరేషన్లను పూర్తిచేసినట్లు ఆసుపత్రి సూపరిండెంట్‌ డా. నాగేందర్‌ తెలిపారు.

చికిత్స అనంతరం అంతా కోలుకుంటున్నారని తెలిపారు. మోకాలిచిప్ప మార్పిడితోపాటు ఇతర శస్త్ర చికిత్సల కోసం ప్రయివేటు ఆసుపత్రులకు వెళ్లి ఆరోగ్యంతోపాటు ఆర్థికంగా నష్టపోవద్దని పేద, సామాన్యులకు డా. నాగేందర్‌ సూచించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement