Monday, April 29, 2024

పొర‌పాట్లు చేశాం … స‌రిదిద్దుకుంటాం – క‌ర్నాట‌క ఓట‌మిపై కిష‌న్ రెడ్డి

న్యూ ఢిల్లీ – కర్ణాటక ఎన్నికల్లో ప్రజల తీర్పును గౌరవిస్తున్నామని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ప్రచారంలో భాగంగా కర్ణాటకలో ప్రధాని మోడీపై విపరీతమైన అభిమానం చూపారని, కానీ స్థానికంగా ఉన్న వ్యతిరేకత కాంగ్రెస్‌కు అనుకూలంగా పని చేసిందన్నారు. తాము కొన్ని పొరపాట్లు చేశామని, కానీ వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో మెజార్టీ సీట్లను సాధిస్తామన్నారు. కనీసం 80 శాతం వరకు కర్ణాటకలో సీట్లను సాధిస్తామన్నారు. ఇక్కడ చేసిన పొరపాట్ల కారణంగా తెలంగాణలో కూడా త‌మ‌కు వ్యతిరేకత ఉంటుందని కొందరు భావిస్తున్నారని, మాకేంటే బీఆర్‌ఎస్‌ రాష్ట్రంలో ఎన్నో పొరపాట్లు చేస్తోందని అన్నారు. బీఆర్‌ఎస్‌ పొరపాట్ల కారణంగా తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement