Monday, April 29, 2024

Boating – కోటిపల్లి ప్రాజెక్టులో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బోటింగ్…

వికారాబాద్ జనవరి 15 ( ప్రభ న్యూస్): కోర్టుపుల్ ప్రాజెక్టులో కేంద్ర పర్యటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే కేసు రత్నం వికారాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షుడు సదానంద కలిసి బోటింగ్ లో పాల్గొన్నారు. సోమవారం పెద్దములు మండలం చైతన్య నగర్ లో చెంచులతో ప్రధానమంత్రి నేరుగా మాట్లాడిన అనంతరం తిరుగు ప్రయాణంలో ఆయన కోటిపల్లి ప్రాజెక్టుకు వెళ్లారు ఈ సందర్భంగా ఆయన స్వయంగా కోటిపల్లిలో బోటింగ్ నిర్వహించారు ఈ ప్రాంతం పర్యాటక అభివృద్ధికి ఎంతో అనువుగా ఉందని అనంతగిరిని 100 కోట్లతో అభివృద్ధి చేయడంతో పాటు కోటిపల్లి సైతం పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని తెలిపారు ఈ కార్యక్రమంలో జీకే వీ ఆర్ ఆర్ మేనేజర్ రాములు తదితరులు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement