Friday, May 3, 2024

Breaking : ఘట్ కేసర్ లో కిడ్నాపైన చిన్నారి సురక్షితం

తెలంగాణలోని మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ లో ఓ నాలుగేళ్ల చిన్నారి కిడ్నాపైన ఘటన స్థానికంగా కలకలం రేపింది. అయితే కిడ్నాపైన చిన్నారిని కిడ్నాపర్ నుంచి రక్షించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో బాలిక ఆచూకీ లభించింది. మేడ్చల్ లోని ఈడబ్ల్యూఎస్ కాలనీలో ఇంటిముందు ఆడుకుంటూ ఆ చిన్నారి కనిపించికుండా పోయింది.

బాలిక క్రిష్ణవేణి రాత్రి షాప్ కు వెళ్లి తిరిగి రాలేదు. తల్లిదండ్రులు వెతికితే కనిపించకపోవడంతో.. అంతటా వెతికినా దొరక్క పోవడంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలింపు చేపట్టారు. అయితే ఎట్టకేలకు కిడ్నాపర్ నుంచి బాలికను పోలీసులు కాపాడారు. సురేష్ అనే కిడ్నాపర్ నుంచి రైల్వే పోలీసులు బాలికను కాపాడారు. కిడ్నాపర్ సురేష్ ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement