Saturday, May 4, 2024

ప్రిన్సిపాల్ ను సస్పెండ్ చేయాలి.. ఎమ్మెల్యే ఆఫీసు ముందు విద్యార్థుల ధర్నా

బెల్లంపల్లి, జులై 6 (ప్రభ న్యూస్) : ప్రిన్సిపాల్ ను వెంటనే సస్పెండ్ చేయాలంటూ విద్యార్థులు బెల్లంపల్లి ఎమ్మెల్యే కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. ప్రిన్సిపాల్ శ్రీనివాస్ తమను బాధిస్తున్నారంటూ ఆయనను వెంటనే సస్పెండ్ చేయాలని దాదాపు మూడు కిలోమీటర్లు పరుగెత్తుకుంటూ వచ్చి బెల్లంపల్లి ఎమ్మెల్యే కార్యాలయం ముందు తెలంగాణ గురుకులం విద్యార్థులు ధర్నా నిర్వహించారు.

విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఎంతో బుజ్జగించినా వినకుండా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు నుండి, క్యాంప్ ఆఫీస్ ముందు రోడ్డుపై ధర్నా నిర్వహించారు. వివాన్ జస్టిస్ అంటూ నినాదాలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ.. విద్యార్థులను ఇష్టం వచ్చినట్లు కొడుతూ చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని, పిల్లలు పెద్ద పిల్లలని తేడా లేకుండా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నాడని ఆ ప్రిన్సిపాల్ ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement