Sunday, May 5, 2024

కరెంట్ షాక్ తో బాలుడు మృతి

బిక్కనూర్ జులై 25 ప్రభా న్యూస్…. కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం అంతం పల్లి గ్రామంలో కరెంటు షాక్ తో రెండున్నర సంవత్సరాల బాలుడు మృతి చెందారు. మండల కేంద్రానికి చెందిన బండి ప్రవీణ్ ,రమ్య దంపతుల కుమారుడు రితిక్ కు కరెంటు షాక్ తగలగా మృతి చెందారు .

రమ్య తల్లి గ్రామమైన అంతం పల్లి గ్రామానికి వచ్చారు. అక్కడ ఇంట్లో రెండున్నర సంవత్సరాల బాలునికి కరెంటు షాక్ తగలడంతో అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు చోటు చేసుకున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement