Friday, May 17, 2024

మ‌హిళా మావోయిస్టు లొంగుబాటు

భ‌ద్రాద్రి కొత్త‌గూడెం : 25 ఏండ్ల ఓ మ‌హిళా మావోయిస్టు.. సీఆర్పీఎఫ్ బ‌ల‌గాలు, భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా పోలీసులు ఎదుట మంగ‌ళ‌వారం లొంగిపోయారు. లొంగిపోయిన మ‌హిళ 2015లో మావోయిస్టు పార్టీలో చేరారు. మ‌ణుగూరు ఏరియాలో ఏరియా క‌మిటీ మెంబ‌ర్‌గా 2020లో బాధ్య‌త‌లు స్వీక‌రించారు. గ‌త ఏడేండ్ల నుంచి మావోయిస్టు పార్టీలో వివిధ హోదాల్లో ఆమె ప‌ని చేశారు. త‌మ ప్రాంతంలో జ‌రుగుతున్న అభివృద్ధిని చూసి, మావోయిస్టు పార్టీ నుంచి త‌ప్పుకోవాల‌ని ఆమె భావించార‌ని భ‌ద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ సునీల్ ద‌త్ మీడియాకు వెల్ల‌డించారు. అంతే కాకుండా డివిజ‌న్ క‌మిటీ మెంబ‌ర్ కూడా ఆమెను లైంగిక వేధింపుల‌కు గురి చేశాడ‌ని, పెళ్లి చేసుకోవాల‌ని బ‌ల‌వంతం చేసిన‌ట్లు సునీల్ ద‌త్ పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement