Friday, April 26, 2024

రెండు కార్లు ఢీ.. ఇరువురు మృతి ..

సత్తుపల్లి, ప్రభన్యూస్‌: సత్తుపల్లి నుంచి విజయవాడ వైపు వేగంగా వెళ్తున్న వాహనం విజయవాడ వైపు నుంచి అంతే వేగంగా వస్తున్న మరో కారును ఢీకొన్నది. ఈ సంఘటనలో కార్లలోని పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయవాడకు తరలించారు. చికిత్స పొందుతూ క్షతగాత్రుల్లో ఇద్దరు మృతి చెందారు. ఇందుకు సంబంధించి సత్తుపల్లి టౌన్‌ సీఐ కథనం విధంగా ఉంది. కృష్ణాజిల్లా, పమిడి ముక్కల మండలం, కపిలేశ్వరపురానికి చెందిన వడాలి భానుమతి, రంగరాజు, రమా, దేవుని కొండ నాగమణి తదితరులు మున్సిపాలిటీలోని ఎన్టీఆర్‌ నగర్‌లో జరిగే ఒక శుభకార్యానికి హాజరయ్యేందుకు గురువారం వస్తున్నారు.

మరో రెండు నిమిషాల్లో శుభకార్యం జరిగే ఇంటికి చేరుకునే అవకాశం ఉంది. కాగా అదే సమయంలో ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ భాగ్యలక్ష్మి కళాశాలలోని మిగతా ఉపాధ్యాయులతో కలిసి వేంసూరు మండలం, వెంకటాపురంలో జరిగే ఫంక్షన్‌కు హాజరయ్యేందుకు కారులో బయల్దేరారు. ఎన్టీఆర్‌ నగర్‌ సమీపంలోని మెట్టాంజనేయ స్వామి ఆలయం వద్ద ఎదురుగా వెళ్లే లారీని ఓవర్‌ టేక్‌ చేసే ప్రయత్నంలో వేగంగా వెళ్లి ఎదురుగా వచ్చే కారును ఢీకున్నారు. ఈ ప్రమాదంలో రెండు కార్లలోని పలువురు తీవ్రంగా గాయపడ్డారు. కృష్ణాజిల్లా నుంచి వస్తున్న వాహనంలోని భానుమతి, రంగరాజు తీవ్రంగా గాయపడటంతో ప్రథమ చికిత్స అనంతరం ఖమ్మం తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందినట్లు-గా పోలీసులు నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement