Friday, May 17, 2024

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రమాదం.. ముగ్గురు మృతి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఓపెన్‌ కాస్ట్‌లో-2లో ఘోర ప్రమాదం జరిగింది. బొలెరోపైకి డంపర్‌ దూసుకెళ్లడంతో ఇద్దరు కార్మికులతోపాటు వాహనం డ్రైవర్‌ ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. డంపర్‌ వాహనాన్ని డ్రైవర్‌ వెనుక్కు తీస్తుండగా అదుపుతప్పి బొలెరోపైకి దూసుకెళ్లినట్లు వాహనం నుజ్జునుజ్జవడంతో ఈ ఘటన జరిగింది. మృతులను పాషా (ఎలక్ట్రీషియన్), సాగర్‌ (జనరల్ మజ్దూర్) , వెంకన్న (బులెరో డ్రైవర్)గా పోలీసులు గుర్తించారు. కాగా మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు.

ఈ వార్త కూడా చదవండి: దళిత బంధు పథకంపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు

Advertisement

తాజా వార్తలు

Advertisement