Sunday, April 28, 2024

పువ్వాడ నాగేశ్వర రావుకు మంత్రి కేటీఆర్ ప‌రామ‌ర్శ‌

సీపీఐ జాతీయ నాయకులు, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తండ్రి పువ్వాడ నాగేశ్వర రావుని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పరామర్శించారు. గత రెండు వారాలుగా అస్వస్థతకు గురై హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో నాగేశ్వ‌ర రావు చికిత్స పొందుతున్నారు. విష‌యం తెలుసుకున్న మంత్రి కేటీఆర్ మంగళవారం ఆయ‌న్ను ప‌రామ‌ర్శించి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మంత్రి కేటీఆర్ ని చూసి పువ్వాడ నాగేశ్వరరావు భావోద్వేగానికి లోనయ్యారు. అనంతరం ఆయ‌న‌ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారికి అందిస్తున్న చికిత్స వివరాలను మంత్రి కేటీఆర్ కి వైద్యులు క్షుణ్ణంగా వివరించారు. కేటీఆర్ వెంట గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement