Saturday, May 11, 2024

భద్రాచలం వద్ద 60 అడుగులు దాటిన గోదావరి

భద్రాచలం : భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 60 అడుగులు దాటింది. ఈ క్రమంలో గోదావరి వరద ఉధృతి దృష్ట్యా ప్రమాదం వాటిల్లకుండా ముందస్తు రక్షణ చర్యల్లో భాగంగా భద్రాచలం, బూర్గంపాడు మండలాల ప్రజలు బయటికి రాకుండా నియంత్రణ చేసేందుకు 144 సెక్షన్ విధించినట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ ప్రకటించారు. 144 సెక్షన్ అమల్లో ఉన్నందున ప్రజలు ఇంటి నుండి బయటకు రావొద్దని, జిల్లా యంత్రాంగానికి సహకరించాలని కలెక్టర్ చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement