Sunday, April 28, 2024

KHM: 11న సీఎం రేవంత్ రెడ్డి సభ.. ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే..

మణుగూరు, మార్చి 8, (ప్రభ న్యూస్): సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ ఈనెల 11న మణుగూరులో జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేశాక తొలిసారిగా మణుగూరులో పర్యటించనున్నారు. మణుగూరులోని ఐటిఐ ప్రాంతంలో సభ ప్రాంతాన్ని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, మణుగూరు డిఎస్పి రవీందర్ రెడ్డి, సభ స్థలాన్ని పరిశీలించారు.

సభ ప్రాంతానికి వచ్చే ప్రజలు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధుల కోసం అన్ని సౌకర్యాలు, ఏర్పాట్లు చేపట్టాలని అధికారులను పాయం వెంకటేశ్వర్లు ఆదేశించారు. ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని, మణుగూరు డీఎస్పీ రవీందర్ రెడ్డిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మణుగూరు సీఐ సతీష్, అధికారులు, ప్రజాప్రతినిధులు, పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement