Saturday, May 4, 2024

KHM | తమ్ముడూ, జరంత ఆవకాయ పచ్చడి పెట్టు.. కూలీలతో జెడ్పీ చైర్మన్ కమలరాజు

ఖమ్మం (ప్రభ న్యూస్​): తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఇవ్వాల (బుధవారం) మధ్యాహ్నం మధిర ట్యాంక్​బండ్​ వద్ద ఆసక్తికర సన్నివేశం కనిపించింది. రేపు (గురువారం) నిర్వహించే చెరువుల పండుగ కార్యక్రమానికి సంబంధించిన పనులను పరిశీలించేందుకు వెళ్లారు జెడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు.

ఈ క్రమంలో పెద్ద చెరువు ట్యాంక్​బండ్​ వద్ద అభివృద్ధి పనులు చేపడుతున్న కూలీలు మధ్యాహ్న భోజనం చేస్తుంటే వారి వద్దకు వెళ్లారు. వారితో కలిసి ఒక సామాన్యుడిలా కూర్చొని ఆప్యాయతగా మాట్లాడారు. వారు తింటున్న భోజన వివరాలను తెలుసుకుని ‘‘జరంతా ఆవకాయ పచ్చడి పెట్టు తమ్ముడూ’’ అని పచ్చడి రుచి చూశారు. కూలీలు కూడా భోజనం చేస్తూ, జడ్పీ చైర్మన్ కమల్ రాజ్ తో మాట్లాడారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement