Sunday, April 28, 2024

TS: భద్రాద్రి అభివృద్దే ముఖ్యం… ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు

భద్రాచలం, మార్చి 4 ( ప్రభ న్యూస్): భద్రాద్రి అభివృద్ధే ముఖ్యమంత్రి ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తెల్లం వెంకటరావు కలవడంపై ఆంధ్రప్రభ ప్రతినిధి కలిసి వివరణ కోరగా….. తెల్లం వెంకటరావు మాటల్లో… నియోజకవర్గ అభివృద్ధి కొరకు ఎవరినైనా కలవచ్చు అందులో భాగంగానే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడం జరిగింది. అందుకు సంబంధించిన పూర్తి నివేదికను ముఖ్యమంత్రి కి సమర్పించడం జరిగింది. ప్రజల కోరిక మేరకు, రాములవారి కళ్యాణానికి రావాల్సిందిగా కోరాను.

భద్రాచలం అభివృద్ధిలో వెనక పడకూడదు. ఇగోలకు పోతే భద్రాచలం అభివృద్ధి జరగదు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మా కుటుంబ శ్రేయోభిలాషి . నేను ఎమ్మెల్యే గా గెలిచిన నాటి నుండి పార్టీ మారతానని ఆరోపణలు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ లో చేరమని నన్ను ఎవరు కోరలేదు. నేను ఇప్పటికీ బిఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను. నా తదుపరి నిర్ణయం ప్రజలపై ఆధారపడి ఉంటుంది.. అని తెల్లం వెంకటరావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నీ కలవడంపై స్పష్టత ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement