Sunday, April 28, 2024

KHM: చెరువులో గుర్తుతెలియని మృతదేహం లభ్యం..

అశ్వాపురం, ఫిబ్రవరి 24 ప్రభ న్యూస్ : అశ్వాపురం మండల పరిధిలోని సుప్రసిద్ధ సాగునీటి వనరుగా పేరొందిన తుమ్మలచెరువు లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని శనివారం కనుగొన్నారు. మృతుడు ప్యాంటు ధరించి ఉన్నాడు. ఒంటిపై చొక్కా లేదు. మృతదేహం దగ్గర ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. మృతదేహం కూడా గుర్తుపట్టని రీతిలో ఉంది. పరిసర ప్రాంత ప్రజల ఫిర్యాదు మేరకు అశ్వాపురం పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement