భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో ఏఈఓ రూ.15 వేలకు కక్కుర్తి పడ్డాడు. జూలూరుపాడు మండలం పాపకొల్లు క్లస్టర్ వ్యవసాయ విస్తరణాధికారిగా పనిచేస్తున్న బెజవాడ మణికంఠ, పాపకొల్లులోని రైతు వేదికలో గిరిజన రైతు నుండి రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా.. ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి పట్టుకున్నారు. ఏకకాలంలో కొత్తగూడెం మండలం సుజాత నగర్ లోని మణికంఠ నివాసముంటున్న గదిలో, అదేవిధంగా మణికంఠ స్వగ్రామం అశ్వరావుపేటలో దాడులు నిర్వహిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement