Tuesday, May 7, 2024

Khammam – జడ్పీ చైర్మన్ కు సీఎం కేసీఆర్ ఫోన్ – వరద పరిస్థితిపై ఆరా…

ఖమ్మం : భారీ వర్షాలు , మున్నేరు వరద నేపథ్యంలో ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు కు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఫోన్ చేసి పరిస్థితులను తెలుసుకున్నారు. మధిర నియోజక వర్గం లో పడుతున్న భారీ వర్షాలపై ఆరా తీసిన ముఖ్య‌మంత్రి నియోజక వర్గం లో వరదల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అప్రమత్తంగా ఉండాలని అధికారులతో సమన్వయం చేసుకుని అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు ఏటువంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని ఆదేశించారు. ఎటువంటి సహాయక చర్యలు అవసరం ఉన్న వెంటనే సమాచారం అందించాలని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement