Sunday, April 28, 2024

KCR’s Today Schedule – నేడు క‌రీంన‌గ‌ర్ జిల్లాలో కెసిఆర్ ప్ర‌జా అశీర్వాద స‌భ‌లు

అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు కరీంనగర్‌ జిల్లాలో పర్యటించనున్నారు. కరీంనగర్‌, చొప్పదండి, హుజూరాబాద్‌ నియోజకవర్గాల్లో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 1.30 గంటలకు కరీంనగర్‌లోని ఎస్‌ఆర్‌ఆర్‌ కలేజీ గ్రౌండ్‌లో జరుగనున్న ప్రజా ఆశీర్వాద సభకు హాజరవుతారు. మంత్రి గంగుల కమలాకర్‌ తరఫున ప్రచారం నిర్వహిస్తారు. అనంతరం చొప్పదండి నియోజవర్గానికి బయలుదేరుతారు. మధ్యాహ్నం 2.35 గంటలకు నియోజకవర్గంలోని గంగాధర మండలం మధురానగర్‌ శివారులోని పత్తికుంటపల్లి కాలనీలో ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొంటారు. స్థానిక బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ను మరోసారి ఆశీర్వదించాలని కోరనున్నారు. అనంతరం 3.45 గంటలకు హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని జమ్మికుంట డిగ్రీ కళాశాలలో నిర్వహించే సభలో సీఎం పాల్గొంటారు

Advertisement

తాజా వార్తలు

Advertisement