Monday, May 6, 2024

ఓబీసీ జిల్లా అధ్యక్షుడిగా కేబిఆర్ గౌడ్

మహబూబ్ నగర్, మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఓబిసి జిల్లా అధ్యక్షుడిగా కే.రాజా బాలచందర్ గౌడ్ ను నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షుడు
నూతి శ్రీకాంత్ గౌడ్ శనివారం ప్రకటించారు. ఈ సందర్భంగా కే. బాలచందర్ గౌడ్ విలేకరులతో మాట్లాడుతూ ఆలిండియా ఓబీసీ చైర్మన్ కెప్టెన్ అజయ్ సింగ్ యాదవ్ ఆశీస్సులతో తనపై నమ్మకం ఉంచి రాష్ట్ర అధ్యక్షుడు తనను పార్టీ ఓబీసీ సెల్ అధ్యక్షుడిగా నియమించినందున రాష్ట్ర పార్టీ నాయకత్వానికి జిల్లా పార్టీ నాయకత్వానికి ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయడంతో పాటు అన్ని నియోజకవర్గాల్లో పార్టీ విజయానికి తన శాయ శక్తుల కృషి చేస్తానని కేబీర్ గౌడ్ పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement