Sunday, April 28, 2024

బిసిలంద‌రూ ఉన్న‌త విద్యావంతులు కావ‌డమే కెసిఆర్ ల‌క్ష్యంః క‌విత‌..

నిజామాబాద్‌: రాష్ట్రంలోని ప్రతి బీసీ బిడ్డ చదువుకోవాలనేది సీఎం కేసీఆర్ స్వప్నమని ఎమ్మెల్సీ కవిత అన్నారు. నిజామాబాద్‌లో బీసీ కుల సంఘాల సమావేశంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాట్లాడారు. నిజామాబాద్‌లో బీసీ బాలిక, బాలురకు ప్రత్యేకంగా మరో రెండు హాస్టళ్లు ఏర్పాటు చేయాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ను కవిత కోరారు. అలాగే నిజామాబాద్‌లో సావిత్రమ్మ పేరుతో బీసీ భవన్ నిర్మించాలని మంత్రికి కవిత వినతిపత్రం సమర్పించారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌, టీఆర్‌ఎస్ నాయకులు, బీసీ కుల సంఘాల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement