Thursday, May 2, 2024

శ్రీ సంత్ సేవాలాల్ మ‌హారాజ్ జ‌యంతి ఉత్స‌వాల‌కు హాజ‌రైన క‌విత‌…

నిజామాబాద్ : గిరిజ‌నుల ఆరాధ్యం దైవం స‌ద్గురు శ్రీ సంత్ సేవాలాల్ మ‌హారాజ్ జ‌యంతి ఉత్స‌వాలు రాష్ర్ట వ్యాప్తంగా ఘ‌నంగా కొన‌సాగుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలోని తార‌క్‌రామ్ న‌గ‌ర్‌లో సంత్ సేవాలాల్ జ‌యంతి ఉత్స‌వాల్లో ఎమ్మెల్సీ క‌విత‌, ఎమ్మెల్యే గ‌ణేశ్ గుప్తా, ఎమ్మెల్సీ వీజీ గౌడ్ పాల్గొన్నారు. అక్క‌డ ఏర్పాటు చేసిన ఉత్స‌వ హోమంలో క‌విత పాల్గొని పూజ‌లు చేశారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్సీ క‌విత మాట్లాడుతూ.. గిరిజ‌నుల అభ్యున్న‌తి కోసం మ‌హ‌నీయుడు సంత్ సేవాలాల్ ఎంతో కృషి చేశార‌న్నారు. బంజారాల అభివృద్ధికి టీఆర్ఎస్ ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంద‌న్నారు. సేవాలాల్ జ‌యంతి ఉత్స‌వాల‌కు ప్ర‌తి యేటా ప్ర‌భుత్వం రూ. కోటి విడుద‌ల చేస్తోంద‌ని తెలిపారు. బంజారాల ప‌ట్ల ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు అపార‌మైన ప్రేమ ఉంద‌న్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత సేవాలాల్ జయంతి అధికారికంగా నిర్వహించడం గర్వకారణం అని పేర్కొన్నారు. అలాగే నాగోబా జాత‌ర‌కు కూడా రూ. కోటి ప్ర‌క‌టించార‌ని ఎమ్మెల్సీ క‌విత‌ గుర్తు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement