Saturday, April 20, 2024

ఎంజిబిఎస్ వ‌ద్ద రోడ్డు ప్ర‌మాదం – ఇద్ద‌రు యువ‌కులు దుర్మ‌ర‌ణం..

హైదరాబాద్‌: ఎంజీబీఎస్‌ వద్ద జ‌రిగి రోడ్డు ప్రమాదంలో ఇద్ద‌రు యువ‌కులు మ‌ర‌ణించారు. నిన్న రాత్రి బైకుపై వెళుతున్న యువకులు రహదారిపై ఉన్న గుంతను తప్పించబోయి అదుపుతప్పి కిందపడ్డారు. ఆ సమయంలో అటు వైపు వెళుతున్న లారీ వారి పై నుంచి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. మృతులు ఫసీఖాన్‌(19), మోసిన్‌(23) చాదర్‌ఘాట్‌ మూసానగర్‌ ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement