Saturday, May 4, 2024

మంత్రి సబితకు కృతజ్ఞతలు తెలిపిన కర్మన్ ఘాట్ హనుమాన్ దేవాలయం చైర్మన్

కర్మన్ ఘాట్ సెప్టెంబర్ 8 (ప్రభ న్యూస్) కర్మన్ ఘాట్ హనుమాన్ దేవాలయం అభివృద్ధికి కృషి చేస్తానని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. నూతన పాలకమండలి చైర్మన్ నల్ల రఘుమారెడ్డి ఆధ్వర్యంలో ధర్మకర్తలతో కలిసి శుక్రవారం మంత్రి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు

.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేవాలయాల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారిస్తారని ఆమె పేర్కొన్నారు. కర్మన్ ఘాట్ దేవాలయం అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని పాలకమండలి సభ్యులకు హామీ ఇచ్చారు. నూతన పాలక మండలి సభ్యులకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు

.

మంత్రి సబిత ఇంద్రారెడ్డిని కలిసిన వారిలో ధర్మకర్తలు గోగిరెడ్డి అంజిరెడ్డి, శైలజ, మధుసాగర్ ,బిల్లా కంటి కిరణ్ కుమార్ గుప్తా, చీర తిరుమలేష్, యాదగిరి ,చేగోని సురేష్ గౌడ్ ,సతీష్ గౌడ్, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు గూడూరు గౌతమ్ రెడ్డి తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement