Thursday, April 25, 2024

వేంక‌టేశ్వ‌ర స్వామి బ్రహ్మోత్సవాల‌కు ముహూర్తం ఖరారు

క‌రీంన‌గ‌ర్‌లో శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి బ్రహ్మోత్సవాలు నిర్వ‌హించేందుకు అర్చ‌కులు ముహూర్తం ఖరారు చేశారు. జనవరి 27 నుండి ఫిబ్రవరి 1 వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు జ‌రుపనున్న‌ట్లు మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ అధికారికంగా ప్ర‌క‌టించారు. ఫిబ్రవరి 2న శోభయాత్ర, 24 నుండి మూడు రోజుల పాటు అధ్యాయం ఉత్సవాల జరగనున్నాయి తెలిపారు. ప‌లు ర‌కాల ప్ర‌త్యేక పూజా కార్య‌క్ర‌మాలు ఉంటాయ‌న్నారు. భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయ‌నున్న‌ట్లు తెలిపారు. క‌న్నుల పండుగ‌గా బ్ర‌హ్మోత్స‌వాలు నిర్వ‌హించ‌నున్న‌ట్లు ఆయ‌న తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement