Friday, May 3, 2024

బాల్క సుమన్ కు అపూర్వ స్వాగతం.. వంద పడకల ఆస్పత్రి మంజూరు చేయించినందుకు కృతజ్ఞతలు

చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలో వంద పడకల ఆస్పత్రి నిర్మాణానికి నిధులు మంజూరు చేయించిన అనంతరం తొలిసారిగా చెన్నూరుకు విచ్చేసిన రాష్ట్ర ప్రభుత్వ విప్, శాసనసభ్యుడు బాల్క సుమన్ కు ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. శుక్రవారం మంచిర్యాల జిల్లా చెన్నూరులో బాల్క సుమన్ కు తెరాస శ్రేణులతో పాటు ప్రజలు ఘన స్వాగతం పలికి భారీ గజమాలతో సత్కరించారు.

ఎమ్మెల్యేగా సుమన్ గెలుపొందిన అనంతరం చెన్నూరు నియోజకవర్గం రూపురేఖలే మారిపోయాయని, గతంలో ఎన్నడూ లేనివిధంగా నియోజకవర్గ అభివృద్ధికి వేలాది కోట్ల రూపాయలు మంజూరు చేయిస్తున్నారన్నారు. తనను నమ్మి గెలిపించిన ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని నియోజక వర్గ అభివృద్దే దేంగా పనిచేస్తున్నానని బాల్క సుమన్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేతలతో పాటు పలువురు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement