Friday, May 3, 2024

మునుగోడులో టీఆర్ఎస్ విజయం నల్లేరుపై నడకే : రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్

మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ విజయం నల్లేరుపై నడకేనని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. సోమవారం మునుగోడు నియోజకవర్గం చందూరు మండలం తుమ్మలపల్లి గ్రామంలో సోమవారం వివిధ పార్టీల ముఖ్య నాయకులు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. వారికి ఎమ్మెల్యే చందర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతించారు. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపు కోసం కృషి చేయాలని సూచించారు. బంగారిగడ్డ గ్రామంలో గడపగడపకు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రైతును రాజును చేయాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ ఉచితంగా ఇరవై నాలుగు గంటల కరెంట్ రైతు బంధు రైతుబీమా సకాలంలో ఎరువులు పంపిణీ సాగునీరు అందిస్తే రైతుల కళ్లలో ఆనందం నింపుతున్నారని అన్నారు.
ప్రతి ఇంటికి సంక్షేమం ప్రతి ముఖంలో ఆనందం లక్ష్యంతోనే సీఎం కేసీఆర్ పాలన సాగుతోందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ని ప్రజలందరూ విశ్వసిస్తున్నారని అన్నారు. ఏ ఇంటికి వెళ్లిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ అభివృద్ధి పథకాలు పోందినవారే ఉన్నరని, కేసీఆర్ ని తమ పెద్ద కొడుకుగా ప్రజలందరూ భావిస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ర్టానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనే శ్రీరామరక్ష అని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అమలు అవుతున్న సంక్షేమ అభివృద్ధి పధకాలు రాష్ట్ర ముఖ్యమంత్రి పాలన టిఆర్ఎస్ పార్టీ గెలిపిస్తుందన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో పేదల సంక్షేమం జరుగుతుందన్నారు. మునుగోడు ప్రజలందరు టీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి కారు గుర్తుకు ఓట్లు వేసి ఆఖండ మేజార్టీతో గెలిపించాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement