Monday, April 29, 2024

మరో వివాదంలో నయనతార దంపతులు

సినీ హీరోయిన్ నయనతార, దర్శకుడు విఘ్నేష్ శివన్ లు మరో వివాదంలో చిక్కుకున్నారు. సరోగసీ (అద్దె గ‌ర్భం ద్వారా పిల్ల‌ల‌ను క‌నడం) విధానంతో వారు కవల పిల్లలకు తల్లిదండ్రులయ్యారని తెలుస్తోంది. అయితే సరోగసీని దేశంలో నిషేధించారంటూ సీనియర్ నటి కస్తూరి సోషల్ మీడియా వేదికగా చేసిన ట్వీట్ వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పోస్టులు వైరల్ గా మారడంతో తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి స్పందించారు. సరోగసి ప్రక్రియ చట్టబద్ధంగా జరిగిందా లేదా అనే దానిపై మంత్రి వివరణ కోరారు. సరోగసీ వివరాలు ప్రభుత్వానికి ఇవ్వాలని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement