Friday, May 3, 2024

వచ్చే ఎన్నికల్లో టిఆర్ ఎస్ కే మద్దతు..

పెద్దపల్లిరూరల్‌: రానున్న మున్సిపల్‌ కార్పోరేషన్‌, మున్సిపాలిటీ ఎన్నికల్లో తమ పార్టీ టిఆర్ ఎస్ కే మద్దతునిస్తుందని మహా జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు ఈదునూరి తిరుమలేశ్‌ తెలిపారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సింగరేణిలో జరగబోయే కార్మిక సంఘాల ఎన్నికల్లో సైతం తెరాస అనుబంధ టీబీజీకేఎస్‌కే తమ పార్టీ భేషరతుగా మద్దతు ఇస్తుందని ప్రకటించారు. రాష్ట్రంలో 18 ఏళ్ల నుంచి ఆ పైబడిన వారందరికి ఉచితంగా కరోనా వ్యాక్సీన్‌ అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. మండల, గ్రామ, జిల్లా స్థాయిలో కమిటీలను వేసి పార్టీని బలోపేతం చేస్తామన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి అక్కపల్లి కుమారస్వామి, బాదావత్‌ వెంకటేశ్‌ నాయక్‌, కార్తీక్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement